మనీలాలో తుఫాను బీభత్సం

 

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాను తుఫాను బీభత్సం అల్లకల్లోలం చేస్తోంది. ఈ తుఫానుకు ‘రమ్మసన్’ అనే పేరు పెట్టారు. ఈ తుఫాను కారణంగా తూర్పు మనీలాలో దాదాపు పదిమంది మృత్యువాత పడ్డారు. సుమారు లక్షా యాభై వేల మంది ప్రజలు ఉన్నదంతా కోల్పోయి కట్టుబట్టలతో మిగలడమే కాకుండా నిరాశ్రయులయ్యారు. భారీగా వీస్తున్న ఈదురు గాలుల వల్ల మనీలాలోని భారీ వృక్షాలు కూడా నేలకూలాయి. చెట్లు కూలిపోవడం, రోడ్లు కోసుకుని పోవడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో ఫిలిప్పీన్ ఇంతటి భారీ తుఫానును ఎదుర్కోలేదని ఫిలిప్పీన్ వాతావరణ శాఖ చెబుతోంది.