పాక్ కాల్పులు... ఇద్దరి మృతి

 

పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ జమ్మూ సెక్టార్లో ఈ ఏడాది భారీగా కాల్పులకు దిగడం ఇదే తొలిసారి. గత పక్షం రోజుల్లో కాల్పుల విరమణకు గండికొట్టడం 16వ సారి. ఈ నేపథ్యంలో భారత - పాకిస్థాన్ సరిహద్దు గ్రామాలకు చెందిన మూడు వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.