TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోంత ఇంట్లోనే బంగారం చోరీ.. ఇంటి దొంగను పట్టేసిన పోలీసులు

Published on: Fri Apr 3, 2026 10:58PM

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు  అన్నది సామెత.. కానీ పోలీసులు అలాంటి దొంగను పట్టేశాడు.  ఓ యువకుడు జలసాలకు అలవాటు పడి తన ఇంట్లోనే దఫదఫాలుగా 137 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అయితే ఇంట్లో వాళ్లెవరూ ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇటీవల ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు నగలు ధరిద్దామని నగలపెట్టె ఓపెన్ చేసి  చూడగా బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దర్యాప్తులో ఇంటి దొంగ బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.   రాజేంద్రనగర్ కంచన్ బాగ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్  అనే వ్యక్తి గత నెల   31న కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో తమ ఇంట్లో బంగారం చోరీ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయన భార్య, కుమార్తె బంగారు ఆభరణాలను బీరువాలో భద్రరిచారు. ఆ తరువాత గత నెల 29న ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలు ధరించేందుకు బీరువాలోని నగల పెట్టె తెరిచి చూశారు. బంగారు నగలు కనిపించకపోవడంతో  గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి నగలు చోరీ చేశారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు  కానీ ఇంటి పరిసరాలు, కుటుంబ సభ్యుల కదలికలు, ఫోన్ కాల్ వివరాలను విశ్లేషించి విషయం తేల్చేశారు. బంగారు ఆభరణాలు చోరీ చేసినది మహ్మద్ షరీఫ్ కుమారుడు  అద్నాన్ షరీఫ్  అని తేల్చాడు.    తన ఇద్దరు స్నేహితులు మహ్మద్ రెహాన్ ఉద్దీన్ (25), మహ్మద్ సమీర్ (22)లతో కలిసిచోరీకి పాల్పడినట్లు గుర్తించారు.  

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి  , జనవరి నుంచి నాలుగు సార్లు ఇంట్లో ఎవరికీ తెలియకుండా నగలను  దొంగిలించాడని తేలింది పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 137 గ్రాముల బంగారు ఆభరణాలు,
4 సెల్ ఫోన్లు,ఒక వెర్నా కారు స్వాధీనం చేసుకున్నారు.