TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

25 ఏళ్లలో చేయనిది 7 ఏళ్లలో చేశాడు

Published on: Wed Aug 12, 2015 3:48PM

 

మంత్రి లక్ష్మా రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. దీనికి గాను తెలంగాణ టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందించి తెలంగాణ అధికార నేతలు రేవంత్ రెడ్డిని విమర్శించడం ఆపేసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బావుంటుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ ను చాలా అభివృద్ధి చేశాడు.. 25 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని ఏడేళ్లలో తాను సాధించాడని అన్నారు. అలాంటి రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ హామీల మీద హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు పర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.