TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో మరో సమ్మె

Published on: Thu May 14, 2015 11:44AM

 

తెలంగాణలో అలా ఆర్టీసీ సమ్మె ముగిసిందో లేదో మరో సమ్మెకు తెర లేచింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ 108 ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగారు. తొలగించిన ఉద్యోగులను విధల్లోకి తీసుకోవాలని, వేతన సవరణలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జీవీకే యాజమాన్యం, 108 ఉద్యోగుల మధ్య చర్చలు విఫలమవ్వడంతో.. 108 నిర్వహణ నుండి జివికె ను తప్పించాలని, ప్రభుత్వ హయాంలోనే 108 సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ కమిషనర్ అజయ్ సమక్షంలో ఇటీవల జరిగిన చర్చలు ఈ నెల 13వ తేదీ బుధవారానికి వాయిదా పడ్డాయి. బుధవారంనాడు మళ్లీ చర్చలు విఫలం కావడంతో అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగులు చెప్పారు. సమ్మె వల్ల దాదాపు 300 వాహనాలు నిలిచిపోయాయి.