కేంద్రంపై సుప్రీం ఫైర్... ఆ పరిస్థితి తీసుకురావద్దు...

 

సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ‌మూర్తుల నియామ‌కంపై అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్న కేంద్రంపై జడ్జి థాకూర్ ఫైర‌య్యారు. మీతో పోరాడాల‌ని మాకు లేదు, కానీ మీరు ఇలాగే వెళ్తే, మేం అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. న్యాయవ్యవస్థలో నియామకాలపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం.. వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితిని తీసుకురావద్దని.. న్యాయమూర్తుల నియామకంలో ప్రతిష్టంభన సరికాదని కేంద్రాన్ని హెచ్చరించారు. వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితిని తీసుకురావద్దు.. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు సూచనలు, విజ్ఞప్తులు చేశాం.. నియామక ప్రక్రియకు విధివిధానాలు ఎందుకు ఖరారు చేయడం లేదు.. హైకోర్టుల్లో సగం ధర్మాసనాలు ఖాళీగా ఉన్నాయని మండిపడ్డారు.