సమగ్రాభివృద్ధిని బాబు కోరుకుంటున్నారు: శివరామకృష్ణన్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రధాన పట్టణాల నిర్మాణానికి అనువైన 14 ప్రాంతాలను గుర్తించామని, ఆగష్టు 20 లోగా కేంద్రానికి తుది నివేదికను సమర్పిస్తామని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏపీ సమగ్రాభివృద్ధిని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోందని, నీరు, రవాణా, ఇతర సౌకర్యాల లభ్యత కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ సూచించింది.ఇంకా ఐదు జిల్లాలో పర్యటించాల్సి ఉందని, వచ్చే పది రోజుల్లో ఆయా జిల్లాల్లో పర్యటిస్తామని ఆయన తెలిపారు. ఏపీలో వివిధ సంస్థల ఏర్పాటుకు 14 ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. తమది కేవలం రాజధాని ఎక్కడో నిర్దేశించే కమిటీ కాదని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలో సూచిస్తామన్నారు. ఏపీకి సంబంధించి 192 ఆఫీసులు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. కార్యాలయాల తరలింపు సంక్లిష్టమైన సమస్యగా శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రతిఏటా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు కావాలని, పాలకులు, అధికారులు ఉద్యోగాలు కల్పించలేరన్నారు. ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలన్నారు. రాజధాని అ౦టే అద్భుత బిల్డింగ్‌లు కాదు....ప్రజలు, సర్వీసులని ఆయన పేర్కొన్నారు.