తెలంగాణ ఇచ్చిన నక్సల్స్ సమస్య ఉండదు: షిండే
posted on Oct 4, 2013 3:27PM
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే నక్సల్స్ సమస్య ఎక్కువవుతుందన్నది అవాస్తవం అని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నక్సలైట్లను అణచి వేయడంలో మంచి రికార్డు ఉందని..విభజన తరువాత కూడా ఇరు ప్రాంతాలలో నక్సల్స్ సమస్య ఉండదని షిండే స్పష్టం చేశారు.
''రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అవతలి వారి మనసులు బాధగా ఉండడం సహజమే. అప్పుడు వారిని ఓదార్చడం తప్ప మరేమి చేయలేం. ఎవరయినా ఈ మనోభావాలకు అతీతులు కారు. ఇరుప్రాంతాల ప్రజలకు నచ్చజెప్పేందుకు..వారి మధ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం” అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. మిగిలిన రాష్ట్రాల డిమాండ్ కంటే ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మాత్రమే ముఖ్యం అని అన్నారు.