సమైక్య శంఖారావం వాయిదా?

 

Samaikya Sankharavam meeting, ysr congress, jagan mohan reddy, Controversy over Samaikya Sankharavam

 

 

రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రేపు హైదరాబాదులో వైకాపా జరుపనున్నసమైక్య శంఖారావం సభ జరుగుతుందా లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే వానల కారణంగా ప్రజలు, పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో కూడా మడమ తిప్పకపోతే ఎలా? అని పార్టీ నేతలే కాక ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా బాధపడుతున్నారు. సాయంత్రం వరకు వేచి నిర్ణయం తీసుకోవాలా?లేక వెంటనే నిర్ణయం తీసుకోవాలా అన్నదానిపై వైకాపా నేతలు తర్జనభర్జనలు చేస్తున్నారు. సాయంత్రం రైళ్లలో బయల్దేరాక వాయిదా వేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుందని భావిస్తన్నారు. బహుశా మధ్యాహ్నం లోగా తుది నిర్ణయం తీసుకోవచ్చు.