సమైక్యశంఖారావంపై అనుమానాలు

 

 Samaikya Sankharavam, jagan mohan reddy, ysrcongress, telangana state,  Heavy rains across AP

 

 

రాష్ట్రంలో వరదపరిస్థితుల దృష్ట్యా సమైక్యశంఖారావం సభ నిర్వాహణపై అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జన సమీకరణకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు కలవరపడుతున్నారు. మరోవైపు 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఎల్బీ స్టేడియంలో సభా వేదిక ఏర్పాట్లు ఎలా జరపాలనే విషయమై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో సీమాంధ్ర జనం హైదరాబాద్ కు రాగలరా అన్న సందేహంతో రంగారెడ్డి, హైదరాబాద్ లలో ఉన్న సీమాంధ్ర ప్రజల మీద ఎక్కువగా ఆధారపడాలని నిర్ణయించారు. ఇక సమైక్య శంఖారావం కోసం భారీ బందోబస్తు చేయనున్నారు.