కేసీఆర్, హరీశ్ రావు ఆంధ్రా వాళ్లతో కుమ్మక్కయ్యారు..

 

తెలంగాణలో ప్రస్తుతం మల్లన్న సాగర్ పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు ఒక పక్క ప్రాజెక్ట్ ఎలాగైన పూర్తి చేస్తామని హరీశ్ రావు అంటుంటే.. దీనిని అడ్డుకొని తీరుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి దీక్ష కూడా ప్రారంభించారు. దీనిలోభాగంగానే గజ్వేల్ నియోజక వర్గానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరీశ్ రావు, కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. మామా, అల్లుడు ఆంధ్రాకాంట్రాక్టర్లతో కుమ్మక్కయి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని.. అక్కడి ప్రజలు ప్రజెక్టు నిర్మాణానికి వ్యతిరేకత తెలిపినా కూడా మల్లన్న సాగర్ నిర్మించడం కోసం మంత్రి హరీశ్‌రావు రైతులను బెదిరిస్తున్నారని.. రైతులు శాంతియుతంగా వారి వ్యతిరేకతను తెలుపుతున్నారని, కాని హరీశ్‌రావు శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారని విమర్శించారు.  4వేల గ్రామాలను కదిలిస్తామని హరీశ్‌ బెదిరిస్తున్నారని, అమాయక రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. మరి దీనిపై హరీశ్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.