నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-33.. లైవ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీర్తి కిరిటంలో మరో కలికితురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-33 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్‌కు సంబంధించి ఇదే చివరి ఉపగ్రహం. ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతలం, ఆకాశం, సముద్రాల్లో నేవిగేషన్ సేవలను అందించనుంది. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా సొంతంగా నేవిగేషన్ వ్యవస్థ ఉన్న అగ్రదేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు.