Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-33.. లైవ్
posted on: Apr 28, 2016 1:02PM
.jpg)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీర్తి కిరిటంలో మరో కలికితురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-33 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్కు సంబంధించి ఇదే చివరి ఉపగ్రహం. ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతలం, ఆకాశం, సముద్రాల్లో నేవిగేషన్ సేవలను అందించనుంది. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా సొంతంగా నేవిగేషన్ వ్యవస్థ ఉన్న అగ్రదేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు.


.jpg)



