జగన్ దీక్ష భగ్నం

 

 

 

తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఆయన నివాసం లోటస్‌పాండ్‌ వద్ద గత శనివారం నుంచి జగన్‌ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషమించటంతో వైద్యుల సలహా మేరకు బుధవారం రాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి జగన్‌ను ఆసుపత్రికి తరలించారు. రక్తపోటు, సుగర్‌ లెవల్స్‌ గణనీయంగా తగ్గడంతో దీక్ష ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. శరీరంలో కీటోన్లు 4 ప్లస్‌గా వృద్ధిచెందినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స నిర్వహించక పోతే శరీర అవయవాలు దెబ్బతినటంతో పాటు అపస్మారక స్థితిలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఆయనను బలవంతంగా నిమ్స్ కు తరలించారు.