వాజ్‌పేయికి మోదీ ఘన నివాళి

 

మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి మొదలైంది.. అంతిమయాత్ర వాహనం వెనక లక్షలాదిమంది కదిలారు.. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి స్మృతి స్థల్‌ వరకూ సుమారు ఏడు కిలోమీటర్లు దూరం.. ఆ లక్షలాది మంది కళ్ళకి మహానేత దూరమయ్యారనే బాధ తప్ప, ఆ 7 కిలోమీటర్ల దూరం కనిపించలేదు.. ఆ లక్షలాదిమందిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి స్మృతి స్థల్‌ వరకూ నడిచి మోదీ, వాజ్‌పేయికి ఘన నివాళి అర్పించారు.. ఒక మాజీ ప్రధాని అంతిమ యాత్రలో ప్రధాని పాల్గొని, 7 కిలోమీటర్లు నడిచి ఘనంగా నివాళి అర్పించడం చరిత్రలో ఇదే తొలిసారి అని బీజేపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రధాని మోదీ మాత్రమే కాదు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రివర్గం, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా 7 కిలోమీటర్లు నడిచి మహానేతకు ఘన నివాళి అర్పించారు.