జేసీని బహిష్కరించాలి: బొత్స

 

 

 

యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆయనపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోనియాపై జేసీ వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని అన్నారు. జేసీని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐసీసీకి లేఖ రాసినట్లు బొత్స తెలిపారు. జేసీ దివాకర్‌రెడ్డికి పార్టీలో ఉండడం ఇష్టంలేకపోతె వేరే పార్టీలోకి వెళ్ళవచ్చునన్నారు. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెట్టడం సరికాదని బొత్స సత్యనారాయణ అన్నారు.