నోట్ల రద్దుపై లోక్ సభలో రచ్చ...

 

పెద్ద నోట్ల రద్దుపై ఉభయసభల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఇక లోక్ సభలో కూడా అదే పరిస్థితి నెలకొంది.  లోక్ సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి.  లోక్ సభలో కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ సహా మొత్తం 21 నోటీసులు ఇచ్చాయి. అంతేకాదు  లోక్ సభలో ప్రధాని మోదీ కనిపించక పోవడంతో ఆగ్రహానికి గురైన విపక్షాలు.. ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పే తీరాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్ష పార్టీల ఎంపీలు పోడియంలోకి ప్రవేశించి ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. నసభ్యులు శాంతించాలని చర్చకు ప్రభుత్వం సిద్ధమని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్నిమార్లు ప్రకటించినా, విపక్ష సభ్యులు మాత్రం వినే పరిస్థితిలో లేరు.