పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

 

 Panabaka Lakshmi on Telangana, Panabaka Lakshmi, Panabaka Lakshmi samaikyandhra, Panabaka Lakshmi telangana

 

 

పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ విప్ జారీ చేస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అనుకూలంగా ఓటు వేస్తారని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. తెలంగాణ ప్రకటన వచ్చినప్పటి నుండి రాజీనామా చేయనని, పదవిలో కొనసాగుతానని చెబుతున్న తక్కువ మంది నేతల్లో పనబాక మొదటి వరసలో ఉంటారు. కాంగ్రెస్ నిర్ణయానికే నా ఓటు అని ఆమె చెబుతున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి సీమాంధ్రులకు రక్షణ కల్పించాలని కోరతానని చెప్పిన ఆమె ఇప్పుడు తాజాగా ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలాన్ని సీమాంధ్రకే కేటాయించేలా కేంద్ర మంత్రుల కమిటీకి ఇచ్చే నివేదికలో పేర్కొంటామని తెలిపారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్దంగా ఉండాలని, బీజేపీ విభజన విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని పనబాక అన్నారు.