దావూద్ మా దేశంలో లేడు: పాకిస్తాన్‌

 

 

 

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. దావూద్ ఇబ్రహీం తమదేశంలో లేడని గతంలోనే స్పష్టం చేశామని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయం అధికార ప్రతినిధి తస్నీమ్ అస్లామ్ అన్నారు. ప్రస్తుతం కూడా దావూద్ తమ దేశంలో లేడని తస్నీమ్ అస్లామ్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. అయితే షిండే మాత్రం తమకున్న సమాచారం మేరకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని తెలిసిందని... అమెరికాతో కలిసి సంయుక్త ప్రయత్నంతో దావూద్‌ను పట్టుకుంటామని ఆయన చెప్పారు.