పీవోకేలో బ్లాక్ డే.. పాక్ పోలీసుల క్రూరత్వం...

 

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాక్ పోలీసులు ఆందోళన కారులపై తమ క్రూరత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. పీవోకేలోని భింబేర్‌, కోట్లీ, ముజ‌ఫ‌రాబాద్‌, మీర్పూర్ ప్రాంతాల్లో  పాక్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వందలాది మంది ఆందోళనకారులు బ్లాక్ డే పాటిస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీల‌తో దాడి చేసి.. కొంత మందిని అరెస్ట్ చేశారు. కాగా 1947లో పాకిస్థాన్  దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డి క‌శ్మీర్‌లో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. అప్ప‌టి నుంచి అక్క‌డ అక్టోబ‌ర్‌ నెలలో పాక్‌కు వ్య‌తిరేకంగా బ్లాక్ డే నిర్వ‌హిస్తారు.