ఎన్డీఏలో చేరడం జీవితంలో జరగదు..

 

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని మోడీతో పొత్తు పెట్టుకుంటారా అంటే మాత్రం అది జరిగే ప్రసక్తి లేదు అంటున్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన "నోట్ల రద్దుకు నేను మద్దతిచ్చాను. ఎందుకంటే, అది మంచి నిర్ణయమని మాత్రమే. అంతమాత్రాన నేను తిరిగి బీజేపీ కూటమిలో చేరతానని కాదు.. ఎన్డీఏలో చేరడమన్నది జీవితంలో జరగని విషయమని.. రాజకీయ అంశంగా నోట్ల రద్దుకు మద్దతును పరిగణించరాదు" అని అన్నారు.  ఇంకా నోట్ల రద్దుపై మాట్లాడుతూ.. బీజేపీ చెప్పినట్టు నోట్ల రద్దు, నల్లధనంపై సర్జికల్ దాడే అయితే, దీన్ని కేవలం ప్రారంభంగా మాత్రమే గుర్తించాలని, ఇంకా చేయాల్సింది చాలా వుందని అన్నారు.