ఇండియా - రష్యాలది పటిష్టమైన మైత్రీ బంధం

 

భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య అణు, రక్షణ, ఇందన రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకునే అంశాల మీద ఆయనతో చర్చించారు. పుతిన్ భారతదేశాన్ని సందర్శించి తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టును సందర్శించాల్సిందిగా మోడీ ఆహ్వానించారు. దానికి పుతిన్ తన అంగీకారాన్ని తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడితో భేటీ అనంతరం మోడీ రష్యా అధ్యక్షుడితో కూడా సమావేశమయ్యారు. భారత, రష్యాలు పాత స్నేహితులు. అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. మోడీ, పుతిన్ దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీని పుతిన్ అభినందించారు. భారత, రష్యాల అనుబంధం చాలా దృఢమైనదని మోడీ ఈ సందర్భంగా అన్నారు.