ప్రాణాలు కాపాడిన మోడీ..
posted on Aug 30, 2016 4:49PM
ప్రధాని నరేంద్ర మోడీ పలువురు మీడియా ప్రతినిధులను కాపాడారంట. అయితే దానికి మోడీ ఫీట్లు గట్రా ఏం చేయలేదులెండి. అసలు సంగతేంటంటే.. మోడీ ఈరోజు గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. జామ్నగర్లో మీట నొక్కి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన అక్కడే కొంచం సేపు నిలబడి నీటి ప్రవాహాన్ని అలా చూస్తుండి పోయారు. ఇంతలోనే ఆయన డ్యామ్ కు కాస్త దూరంలో జర్నలిస్ట్లు ఫొటోలు తీస్తూ కనిపించారు. అయితే వారు నీటి ప్రవాహాన్ని గమనించలేకపోయారు. అయితే ఇదంతా గమనించిన మోడీ వారికి చప్పట్లు కొడుతూ, చేతులు ఊపుతూ సిగ్నల్స్ ఇవ్వడంతో వాళ్లు అక్కడి నుంచి తప్పుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయాన్ని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ స్వయంగా వెల్లడించడంతో మేటర్ బయటపడింది. మొత్తానికి మోడీ తన సమయస్ఫూర్తిని బాగానే ఉపయోగించారు.