మోడీ జిన్‌పింగ్ హాయ్ హాయ్... భారత్, చైనా భాయ్ భాయ్..!

 

భారత్, చైనా దేశాల స్నేహ సంబంధాలు బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య మధ్య సరిహద్దులు చెరిపేసేలా స్నేహబంధం పటిష్టం చేసుకుందామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఇరు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకుందామని, దీనిని మనం సామరస్యంగా పరిష్కరించుకోగలిగితే, ప్రపంచానికే ఆదర్శంగా నిలవొచ్చన్న మోడీ అభిప్రాయంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పూర్తిగా ఏకీభవించారు. భారత్, చైనాలు ప్రత్యర్థులు కాదని జిన్ పింగ్ అన్నారు. . స్నేహపూర్వకంగా, సానుకూల దృక్పథంతో ముందుకెళదామని, ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని జిన్‌పింగ్‌ చెప్పారు. బ్రిక్స్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు సోమవారం బ్రెజిల్‌ వచ్చిన మోడీ... చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు