ఎంపీ లగడపాటికి పితృవియోగం

 

 

 

విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి వెంకటరామానాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆరునెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గ్లోబెల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామానాయుడు భౌతికకాయాన్ని స్వస్థలం గుంటూరు జిల్లాకు తరలించారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.