ఎంపీ హర్షకుమార్ కుమారుల వీరంగం

 

MP Harsha Kumar sons Attack on apngos, MP Harsha Kumar,  apngos, Samaikyandhra Movement, Samaikyandhra protesters

 

 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ హర్షకుమార్ తనయులు వీరంగం వేశారు. ఎంపీ హర్షకుమార్ కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన జీవ్ ఫ్లెక్సీలను ఏపీఎన్జీవోలు దగ్దం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ కుమారులు అక్కడికి చేరుకొని ఇద్దరూ ఏపీఎన్జీవోలపై కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా ఏపీఎన్జీవోలపై దాడి చేశారు. ఎంపీ తనయుల వైఖరికి నిరసనగా ఏపీఎన్జీవోలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కళాశాలపై రాళ్ళ వర్షం కురిపించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.