జైలుకు మోపిదేవి
posted on Oct 25, 2013 11:32AM
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అందరూ జైలు నుంచి బయటకు వస్తుంటే మోపిదేవి వెంకట రమణ మాత్రం మళ్లీ జైలుకు వెళ్లాడు. అందరి కన్నా మొదట జైలు నుంచి బయటకు వచ్చిన మోపిదేవి మళ్లీ జైలు కు వెళ్లాడు. వాన్పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం కోర్టు మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈ నెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో లొంగిపోయాడు. అయితే వెనువెంటనే మోపిదేవి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం విశేషం. దీనిపై విచారణను కోర్టు నేటికి వాయిదా వేస్తూ, ఆయనకు 31 వరకు రిమాండ్ విధించింది.