తెలంగాణలో మావోయిస్టులు..!

 

తెలంగాణ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో పోలీసులు పెద్దపల్లిలోని ప్రధాన కూడళ్లలో విస్త్రతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రహదారిపై వచ్చిపోయే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీచేసిన తర్వాతనే పంపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

 

బీహార్ లో మరోసారి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గయ వద్ద రైల్వే ట్రాక్ ను పేల్చివేశారు. దీంతో ఢిల్లీ-హౌరా మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి 15 రైళ్లు నిలిచిపోయాయి. యముక్ వద్ద నీలాంబర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. గయా ఘటనపై రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ విచారణకు ఆదేశించారు.