హైదరాబాద్ మీద అనుమానం

 

 

 

కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు హైదరాబాద్ మీద అనుమానమొచ్చింది. అసలు ఇది హైదరాబాదా ? లేక పాకిస్తానా ? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్ సోదరి షర్మిల కూడా పలుమార్లు ఇలాగే హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చారు. ఇప్పుడు మల్లాది విష్ణు కూడా అదే మాట అంటున్నారు. ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ లో సభ నిర్వహించడంతో టీఆర్ఎస్ పార్టీ కలవర పడుతుందని, హైదరాబాద్ లో సభ అడ్డుకోవడం చూస్తుంటే పాకిస్తాన్ లో ఉన్న అనుమానం కలిగిందని ఆయన అన్నారు.

 


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని చెప్పకుండా సీమాంధ్రలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అయితే నేతలు హైదరాబాద్ ను పాకిస్తాన్ పోల్చడం నిజంగా తప్పుపట్టాల్సిన అంశమే. ప్రజలను రెచ్చగొట్టేందుకో .. ఆకట్టుకునేందుకో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి