దక్షిణ కొరియాలో గాంధీజీ విగ్రహం

 

మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలిసారి దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో ఏర్పాటు చేసింది. సోమవారం నాడు వైభవంగా జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ బైయోంగ్ సూసు ఈ స్మారక విగ్రహాన్ని ఆవిష్కరించి దేశానికి అంకితమిచ్చారు. దక్షిణ కొరియాలోని భారత రాయబారి విష్ణూప్రకాశ్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి డైరెక్టర్ జనరల్ సతీశ్ మెహతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుసాన్ నగర మేయర్ సూసు భారత్-కొరియా మధ్య సంబంధాలు క్రమంగా బలోపేతమవుతున్నాయని, ఇప్పుడీ గాంధీజీ విగ్రహం ఏర్పాటుతో అవి మరింత బలపడతాయని అన్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశం ప్రతి కొరియన్‌లోనూ స్ఫూర్తి నింపుతుందని సూసు ఆశాభావం వ్యక్తం చేశారు.