లాలూకి మరో షాక్..

 

లాలూ ప్రసాద్ యాదవ్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈయన దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కాంకు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా నిర్ధారిస్తూ రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి మధ్య దుంబా ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేసినట్టు రుజువైందని కోర్టు తెలిపింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 14 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.