సమైక్య'అత్త'కు..విభజన 'అల్లుడు'..
posted on Dec 19, 2013 5:04PM
గురువారం అసెంబ్లీ ఆవరణలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. సమైక్యం కోసం గట్టిగా మాట్లాడే టిడిపి నేత నన్నపనేని రాజకుమారిని తెరాస నేత కెటిఆర్ పరామర్శించారు. ''అత్తమ్మా పడిపోయావ్ గా ఎలా ఉన్నావ్'' అంటూ ఆరాతీశారు. శాసనమండలిలో జరిగిన తోపులాటలో నన్నపనేనిని తెరాస ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తోసేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ...స్వామిగౌడ్ కావాలని ఆమెని పడేయలేదంటూ వివరణ ఇచ్చారు. టీవిల్లో నన్నపనేని పడిపోయిన వైనం చూసిన నాన్న కెసిఆర్ చాలా బాధపడ్డారని కూడా ఆయన చెప్పారు. ఈ సంధర్బంగా నన్నపనేని కూడా కెటిఆర్ తో ముచ్చటించారు. మొత్తం మీద ఆంధ్రా అత్తకు తెలంగాణ అల్లుడుకు మధ్య చోటుచేసుకున్న ఈ కుశల ప్రశ్నల పర్వం..ప్రాంతాలకతీతంగా అందరినీ ఆకట్టుకుంది.