కళంకిత మంత్రులను తొలగిస్తారా!

 

Kiran Kumar Reddy, congress Kiran Kumar Reddy, Kiran Kumar Reddy Sonia Gandhi

 

 

అవినీతి మంత్రుల జాబితాలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుల తొలగింపు ఖాయమే అని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుండి తిరిగి రాగానే జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే ధర్మాన, సబితలు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని కొనసాగించడం ఏ మాత్రం మంచిది కాదని, వారిని తొలగించి అవినీతికి, అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ దూరం అని చాటాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి మీదనే ఈ బాధ్యత వేసినట్లు సమాచారం. అందుకే ముఖ్యమంత్రి శ్రీకాకుళంలో ఉన్న మంత్రి ధర్మానను ఉన్నపళంగా హైదరాబాద్ రావాలని కోరారు. రాత్రి వరకు అక్కడే ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఫోన్ రాగానే వెంటనే బయలుదేరారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో అవినీతి మంత్రులు గౌరవంగా తప్పుకోవాలని సూచించడం కూడా అధిష్టానం ఆలోచనలకు అద్దం పడుతుంది.