విభజన వల్ల కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింటుంది: కిరణ్

 

 

 

జీవోఎంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటి ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జీవోఎంకి లేఖతో పాటు రెండు పుస్తకాలు అందజేశారు. విభజన వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బ తింటుందని చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విభజన వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అన్ని వసతులు హైదరాబాద్ లొనే ఉన్నందు వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చె అవకాశం ఉందని చెప్పారు. వైద్య,విద్య అంశాలపై తీవ్ర ఇబ్బందులు వచ్చె ప్రమాదం ఉందని అన్నారు. దేశానికి నక్సలిజం ప్రధాన సమస్య అని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నక్సల్స్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంది కాబట్టి విభజన వల్ల నక్సలిజం, మతతత్వశక్తులు రేచ్చిపోతాయని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల భద్రత సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయని.. విభజన వల్ల పోలీసు బలగాలను నలభై శాతం పెంచాల్సి ఉంటుందని జీవోఎం కు చెప్పానన్నారు.