సమైక్యంపై ప్రజలను మోసం చేయను

 

Killi Krupa Rani Samaikyandhra, telangana state, sonia gandhi, Killi Krupa Rani, congress

 

 

రాష్ట్ర విభజన వ్యవహారం కీలకదశకు చేరుకున్న పరిస్థితులలో ప్రజలను మభ్యపెట్టలేనని, ఎవరయినా సీడబ్లూసీ తీర్మానానికి లోబడే వ్యవహరించాలని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. విభజన ఆగదని తెలిసి కూడా సీమాంధ్ర ప్రజలకు రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది అని చెప్పి మోసం చేయలేను చెప్పారు. ఈ రోజు ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భేటి తరువాత మాట్లాడుతూ.. ఈ నెల 18, 19 తేదీల్లో విభజన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని కలుస్తామని, సీమాంధ్ర ప్రయోజనాల గురించి పట్టుబడతామని కృపారాణి తెలిపారు. పైలిన్ తుపాను బాధితుల గురించి, ఇతర నష్టాల గురించి సోనియాగాంధీకి వివరించానని, తుపాను బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరానని తెలిపారు.