కాంగ్రెస్కు మరొ ఎదురుదెబ్బ
posted on Aug 26, 2013 9:20PM
విభజన సెగలతో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా అనంతపురంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవిభజన వ్యవహారంలో కాంగ్రెస్ తీరుతో ఆగ్రహంగా ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విభజన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న కేతిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశారు. ఆమె కండువా కప్పి కేతిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కాటసారి, కేతిరెడ్డిల దారిలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.