సిద్ద రామయ్యను శపించాడంట..

 

కర్ణాటక సీఎం సిద్దరామయ్య కారుపై కాకి వాలినందుకే ఆయన కారును మార్చి వేరే కారు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు పలు రకాలుగా విమర్శించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మరో తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. సిద్దరామయ్యను ఎవరో ఓ గుర్తు తెలియని వ్యక్తి శపించాడంట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమని అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ఇంటి వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సిద్దరామయ్య కారులో వెళుతుండగా వచ్చి అతనికి పూజ చేసిన ఓ వస్త్రాన్ని ఇచ్చాడంటా. అయితే దానిని సీఎం స్వీకరించకపోవడంతో కోపగించుకున్న అతను ముఖ్యమంత్రిని శపించాడట.


అయితే ఈ విషయాన్ని సీఎం గారు పెద్దగా పట్టించుకోకపోయినా కార్యకర్తలు మాత్రం ఆందోళనలు చెందుతున్నారు. దీనిపై మాట్లాడిన కార్యకర్తలు అసలే కొంతకాలంగా సీఎంను దురదృష్టం వెంటాడుతోందని, ఈ సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అందుకే శాపాన్ని వెనక్కు తీసుకోవాలని అతన్ని కోరినట్లు వివరించారు.