'తెలుగుతేజం' యాత్రలో జెపికి సమైక్య సెగ
posted on Sep 14, 2013 5:44PM
లోక్ సత్తా నేత, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ‘తెలుగుతేజం’యాత్రలో సమైక్య సెగ తగిలింది. కొండారెడ్డి బురుజు వద్ద జేపిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో లోక్సత్తా కార్యకర్తలకు సమైక్యవాదులకు మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. సమైక్యవాదులు అక్కడ ఉన్న స్పీకర్ బాక్స్లను తోసి వేశారు. జేపి గోబ్యాక్ అని నినాదాలు చేశారు. జేపీ వెళ్లిపోయిన అనంతరం సమైక్యవాదులు లోక్ సత్తా పార్టీ బ్యానర్ల, జెండాలను తొలగించారు. ఇక కర్నూలులో జేపీ వ్యాఖ్యల పట్ల తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్ర విభజన జరిగిందని హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన జేపీ ఇప్పుడు విభజన అంశం ముందుకు వెళ్లొద్దని, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టామని, రాజధానిని త్యాగం చేశామని ఎలా అంటారని తెలంగాన వాదులు ప్రశ్నిస్తున్నారు.