చేసిన మేలు మరచే చంద్రబాబు: జయప్రద కామెంట్!

 

 

 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు మేలు చేసిన వారిని మరచిపోయే వ్యక్తి అని ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు జయప్రద వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చంద్రబాబు మీద విమర్శలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తాను ఎన్నో త్యాగాలు చేసి ఎన్టీఆర్ వెంట నడిచానని, పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత తాను చేసిన త్యాగాలన్నిటికీ గుర్తింపు లేకుండా పోయిందని ఆమె బాధపడ్డారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చాక తనకు సాయం చేసిన వారిని మరచిపోవడం అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో వున్న విలువలు ఇప్పుడు లేవని జయప్రద అన్నారు.