రాష్ట్రపతి చెన్నై ప్రయాణం రద్దు.. విమానంలో సాంకేతిక లోపం


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెన్నై ప్రయాణం రద్దు అయింది. జయలలితకు నివాళులర్పించేందుకు చెన్నై బయలుదేరగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి బయల్దేరగానే సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానాన్ని తక్షణం వెనక్కి మళ్లించి ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. దీంతో ప్రణబ్ చెన్నై వస్తారో.. లేదో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై చేరుకున్నారు. జయలలిత పార్థీవదేహానికి ఆయన నివాళులు అర్పించనున్నారు.