బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఉగ్రవాది, పాక్ రేంజర్లు హతం..


భారత్ సరిహద్దుల్లో పాక్ సైన్యం తరచూ కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని  హీరా నగర్ సెక్టార్ పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు వారికి ధీటుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది సహా, ఏడుగురు పాక్ రేంజర్లను హతమార్చినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూలో చొరబడాలన్నదే వారి ప్రధాన లక్ష్యమని, చొరబాటు యత్నాలను తాము తిప్పికొడుతున్నామని తెలిపారు.