ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్..

 

జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే భారత్ సైన్యం పాక్ రేంజర్లను హతమార్చుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులున్నారనే ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం అందగా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు జమ్మూలోని కుల్గాం జిల్లాలో ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాగా...  ఒకరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదిని అని తెలిపారు. వీరిలో ఒక పోలీసు కూడా ఉన్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కుప్వారా జిల్లా నుంచి వచ్చిన ఒక పోలీసు కూడా ఉన్నారని, వారి దగ్గర నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.