జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్..

 

భారత్ సరిహద్దుల్లో పాక్ సైన్యం తరచూ కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఉగ్రవాదులు తరచూ భారత్ లోకి చొరబడే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో జైషే-ఇ-మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసింది. 46 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే-47, పిస్టల్, మందుగుండు సామాగ్రి, గ్రనేడ్ లాంచర్, యూబీజీఎల్ గ్రనేడ్స్‌ను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.