దీక్ష నుంచి జగన్ మాయం..!

 

Jagan indefinite fast, Jagan Mohan Reddy fast camp, ysrcongress,Samaikyandhra stir, telangana note

 

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్ దీక్ష శిబిరంలో మొదటి రోజు ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. మొదటి రోజు శనివారం రాత్రి 11 గంటలకు దీక్షా శిబిరం వద్ద లైట్లు ఆర్పేశారు. ఆ తరువాత దీక్షా శిబిరం నుండి జగన్ లేచి వెళ్లిపోయాడు. రెండు గంటల పదిహేను నిమిషాల తరువాత ఆయన తిరిగి శిబిరంలోకి వచ్చాడు. దీనికి సంబంధించిన విజువల్స్ పలు ఛానళ్లలో వార్తలుగా రావడంతో ఆయన దీక్ష వ్యవహారం చర్చకు తెరలేపింది. ఆయన ఇంటికి వెళ్లలేదని, పక్కనే ఉన్న బస్సులోకి వెళ్లి స్నానం చేసి వచ్చాడని పార్టీ నేతలు చెబుతున్నా ఏకంగా రెండు గంటలకు పైగా దీక్షా శిబిరం విడిచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.