లగడపాటిపై జగన్ హాట్ కామెంట్

 

 

 

విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ పై వైకాపా అద్యక్షుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్ గురించి తాను మాట్లాడటం మొదలు పెడితే 'పెంట మీద రాయి వేసినట్లే' అని అన్నారు. సమైక్యానికి వైయస్సార్ కాంగ్రెసుతో పాటు మజ్లిస్, సిపిఎంలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు. రేపు తమ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని చెప్పారు. జైల్లో ఉన్నా నిజాయితీగా రాజకీయం చేశా ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో అందరికీ తెలుసునని జగన్ అభిప్రాయపడ్డారు. తాను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ నిజాయితీగా రాజకీయం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిలబెట్టిన చంద్రబాబు కుమ్మక్కయ్యారా లేక మేమా అన్నది మీరే గుండె మీద చెయి పెట్టి ఆలోచించుకోవాలని జగన్ అన్నారు.