TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బాలికలదే పై చేయి

Published on: Tue Apr 24, 2012 2:28PM

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బాలికలదే పై చేయి. మంగళవారం ఉదయం మంత్రి పార్థసారథి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లోనూ బాలికల హవా కొనసాగింది. సెకండియర్ ఫలితాల్లో మొత్తం 58.43శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలికలు 61.25 శాతం ఉత్తీర్ణతతో పైచేయిగా నిలవగా బాలురు 55.95 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నారు. మే 23 నుంచి 31 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది. ఇక పునర్ మూల్యాంకనం చేసుకోవాలనుకునే విద్యార్థులు వచ్చే నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ అయిదో తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయి.