బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఈ ఉదయం ఉద్రిక్త వాతారణం నెలకొంది. పెండింగ్ స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటోందంటూ ఏఐఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలు క్వార్టర్స్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే తమ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు విఫలయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.