ఆఖరికి సుందర్ పిచాయ్ కూడా..

 

ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చేరిపోయాడు. ఆయన కూడా హ్యాకింగ్ కు బుక్కయ్యాడు. అవర్ మైన్ గ్రూప్ ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్టు చెబుతోంది. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాకింగ్ చేసి.. క్రౌడ్ సోర్స్ డ్ సమాధాన సైట్ కు అనుసంధానంగా ఉండే ట్విట్టర్ అకౌంట్లో తప్పుడు క్వారా పోస్టులను పోస్టు చేసింది. అంతేకాదు సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ హ్యాకింగ్ కు పాల్పడ్డామని, గూగుల్ సీఈవో భద్రత చాలా వీక్ గా ఉందని అవర్ మైన్ గ్రూప్ తెలిపింది. ఎవరైనా దాడిచేసే విధంగా ఉందని పేర్కొంది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది.