ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

 

Ganesh Visarjan 2013, Ganesh immersion, hyderabad Ganesh immersion

 

 

జంట నగరాల్లో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి భారీ వినాయకలను తరలిస్తున్నారు. నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ సహా 24 చెరువులను ఏర్పాటు చేశారు. 20 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.


వినాయక నిమజ్జనం రేపు ఉదయానికల్లా పూర్తివుతుందని సీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాటు పూర్తైనట్లు చెప్పారు. నగరంలో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా కొనసాగుతోందని, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. నిమజ్జన ఉత్సవాన్ని  పూర్తి చేసేందుకు భక్తులు కూడా సహకరించాలని సీపీ అనురాగ్‌శర్మ కోరారు.