ఏపీఎన్జీవోలకు దిగ్విజయ్ కృతజ్ఞతలు

 

 Digvijay Singh Say Thanks to AP NGOs, Digvijay Singh, AP NGOs, samaikyandhra, telangana

 

 

కాంగ్రెస్ సీనియర్ నేత..రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఏపీఎన్జీవోలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో 79 రోజులపాటు ఉధృతంగా సమైక్య ఉద్యమం చేసిన సీమాంధ్ర ఎన్.జి.ఓలు సమ్మెను విరమించారు. ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రుల సమస్యలను జీవోఎమ్ పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర మధ్య పంపకాల విషయంలో సమన్వయానికి జీవోఎమ్ కృషి చేస్తుందన్నారు. విభజన తర్వాత కూడా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం కొనసాగాలని దిగ్విజయ్ సింగ్ ఆకాంక్షించారు.