కూతురు వయసున్న అమృతతో దిగ్విజయ్ కనెక్షన్

 

 

 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తన కూతురు వయసున్న టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆమెతో దిగ్విజయ్ సన్నిహితంగా వున్న ఫొటోలు మీడియాలో లీక్ కావడం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పెళ్ళయిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు రాజ్యసభ టీవీ ఛానెల్ యాంకర్ అయిన అమృతతో గ్రంథం నడుపుతున్నాడు. తన గుట్టు మీడియాలో బయటపడేసరికి కంగుతిన్న దిగ్విజయ్ సింగ్ ఆమెను తాను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టుగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అలా తన ఘనకార్యానికి లీగాలిటీ లేబుల్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్న అమృత చేత ఆమె భర్తకి విడాకులు ఇప్పించే ప్లాన్ కూడా దిగ్విజయ్ సింగ్ దిగ్విజయంగా పూర్తి చేశాడు. త్వరలో ఆమె తన భర్తతో విడాకులు తీసుకోబోతోందని, ఆమెను తాను పెళ్ళి చేసుకోబోతున్నానని అయ్యగారు సగర్వంగా ప్రకటించాడు.